Friday, May 3, 2024

రాముని కోటి తలంబ్రాల పంటకు శ్రీమంతం..

కోరుకొండ : ప్రతియేటా శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణానికి అందించే గోటితో ఓలిచే కోటి తలంబ్రాల పంటకు కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షులు కళ్యాణం అప్పారావు ఆధ్వర్యంలో వరి పంటకు శ్రీమంత కార్యక్రమం నిర్వహించారు. తన తల్లి కళ్యాణం చక్రధరవేణి పొలంలో పండించే వరి పంటను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శ్రీరామ భక్తులకు స్పందించి గోటితో ఒడ్లు ఒలిచి కోటి తలంబ్రాలు సిద్ధం చేసి భద్రాచలం శ్రీ రామచంద్ర మూర్తి, ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాల సందర్భంగా ఎంతో భక్తి శ్రద్ధలతో అందిస్తారు. అందులో భాగంగా కళ్యాణం అప్పారావు పంటకు వస్తున్న వరి పొలంలో శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ రామ రక్షా స్తోత్రం, విష్ణు సహస్రనామ పారాయణం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించి హారతి ఇచ్చారు. ఈకార్యక్రమంలో పలువురు మహిళలు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement