Sunday, April 28, 2024

Trains: కాజీపేట- విజయవాడ పలు రైళ్లు రద్దు

కాజీపేట-వరంగల్ మధ్య రైల్వే మూడో లైన్ పనులు కొనసాగుతుండడంతో పలు రైళ్లను వారం పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.

రైల్వే లైన్ పనుల కారణంగా కాజీపేట-విజయవాడ మధ్య నడిచే గుంటూరు-సికింద్రాబాద్ ఇంటర్ సిటీ, లింగంపల్లి నుంచి కాకినాడ వెళ్లే గౌతమి ఎక్స్ ప్రెస్ లను ఈ నెల 10 నుంచి 18 వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. శాతవాహన ఎక్స్ ప్రెస్ ను ఈ నెల 7 వ తేదీ రద్దు చేయడంతో పాటు 10 వ తేదీ నుంచి ఈ నెల 18 వరకు రద్దు చేస్తున్నట్లు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement