Thursday, May 2, 2024

శీఘ్రంగా సిద్ధినిచ్చే…పంచ వక్త్ర హనుమాన్‌ మంత్రం!

ఒకానొక రోజు పరాశర మహర్షిని మైత్రేయుడు ఇలా ప్రశ్నించాడు. ”కలికాలంలో దు:ఖాలను దూరం చేసేది, దారిద్య్రాన్ని పోగొట్టేది, వ్యాధుల నుండి రక్షించేది, సర్వదా విజయాలను చేకూర్చేది అయిన మంత్రం ఏదైనా వుంటే తెలియజేయండి.” దానికి ఆ మహర్షి సంతోషించి ”మైత్రేయా! మంచి ప్రశ్న వేశా వు. నీ ద్వారా లోకానికి ఉపయోగ కరమైన మంత్రాన్ని చెప్తాను విను. అది సకల వేదశాస్త్ర, పురాణాదుల సారమే. సత్వరం ఫలితాన్నిచ్చేది ఈ మంత్రం. నేను ఒకసారి సరయు నది దగ్గర వుండగా, నా తండ్రి వసిష్టు డు నాకు వెంటనే ఫలితం ఇచ్చే మంత్రాన్ని ఉపదేశించాడు. శివ, వైష్ణవ, శాక్తేయ, గాణాపత్య మంత్రాలు వెంటనే సత్ఫలితాలను ఇవ్వవు.
వెంటనే ఫలితమిచ్చే మంత్రాలలో లక్ష్మీనారాయణ విద్య, భవానీ శంకర విద్య, సీతారామ మహా విద్య, హనుమన్మహా విద్య చాలా ముఖ్యమైనవి. వీటి తరువాత నృసింహ విద్య, బ్రహ్మాస్త్ర విద్య, అస్తార్ణ మారుతీ విద్య. ఎని మిదవది సామ్రాజ్యలక్ష్మీ విద్య, తొమ్మిది మహా గణపతి విద్య, పది సౌర విద్య, పదకొండవది దక్షిణ కాళీ విద్య. పన్నెండవ విద్య చింతామణి విద్య. వీటినే ద్వాదశ విద్యలు అంటారు. వీటిలో దక్షిణ కాళికా విద్య ఒక్క రాత్రిలో ఏ ఆచా రమూ పాటించకపోయినా ఫలితాన్ని ఇస్తుంది. అస్తార్ణ మారుతీ విద్య ఇంకా తక్కువ సమయంలో ఫలితం చేకూరు స్తుంది. ఇందులో అనులోమ, ప్రతిలోమంగా యాభై వర్ణా లు వుంటాయి. బాగా జపిస్తే బ్రహ్మాస్త్ర విద్య మంచి ఫలితా న్నే ఇస్తుంది. నృసింహ విద్య ఇంతకంటే తక్కువ కాలంలో ఫలిస్తుంది. వీటి అన్నిటికంటే గురువు ద్వారా పొందిన ”పంచ వక్త్ర హనుమా న్‌ మంత్రం” శీఘ్రంగా సిద్ధి నిస్తుంది.
ఈ జప మహాత్మ్యం వల్లనే అగస్త్యుడు సప్త సముద్రాల నీటిని పుడిసిలిలో పట్టి తాగ గలిగాడు. అర్జునికి, భీమునికి శత్రువులను జయించే శక్తి దీనివల్లే కలిగింది. విభీషణుడు ఈ మంత్రం వల్లే శాశ్వత సంపదను శ్రీ రామానుగ్రహంతో పొందాడు.
హనుమాన్‌ మంత్రం చేత జయం, గౌరవం, రాజ్యం, జన వశ్యం, అచంచల భాగ్యం కలుగుతాయి. ధర్మార్ధ, కామ మోక్షాలు, ఆపదలను పోగొట్టుకోవటం, శత్రు జయం, నిగ్ర హానుగ్రహశక్తి దీనివల్ల సాధ్యమవుతుంది. వాక్సుద్ధి, పుత్ర సంతానం, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అయితే గురు ముఖ తా ఈ మంత్రాన్ని ఉపదేశం పొంది, గురువును సంతృప్తి పరిచి ధ్యానిస్తే గొప్ప ఫలితం వుంటుంది. పరిశుద్ధమైన మనసుతో నూట ఎనిమిదిసార్లు మంత్రాన్ని జపించాలి. అన్ని విద్యలకు ఇది ఆధారమైన మంత్రం. పంచ వక్త్ర మహా విద్య గురు కృప వల్ల సామ్రాజ్య సాధనకు తోడ్పడుతుంది. శ్రీ ఆంజనేయ మహాత్మ్యాన్ని, వెయ్యి శిరస్సులున్న ఆది శేషుడు కూడా వంద ల సంవత్సరాలు చెప్పినా తరగదు.” అని పరాశర మహర్షి మైత్రేయ మునికి శ్రీ ఆంజనేయ మంత్ర మహాత్మ్యాన్ని వర్ణించి చెప్పాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement