Sunday, May 19, 2024

ఆ గీత కార్మికుడు మృతి

చివ్వెంల‌: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం లో తాటి చెట్టుపై నుండి ప‌డి గాయాల‌పాలైన గీత‌కార్మికుడు మృతి చెందాడు. ఉద‌యం క‌ల్లు గీసేందుకు చెట్టెక్కిన కార్మికుడు అమ‌రాగ‌ని న‌ర్స‌య్య ప్ర‌మాద‌వ‌శాత్తూ మోకు జారీ కింద‌ప‌డి గాయాల పాల‌య్యాడు. ఆ స‌మ‌యంలో ప‌క్క‌నే ఉన్న మహిత గౌడసోదరులు సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్క‌డ చికిత్స పొందుతూ కొద్ది సేప‌టి క్రితం న‌ర్స‌య్య మృతి చెందాడు. ఆయ‌న మ‌ర‌ణం ప‌ట్ల గీత కార్మిక సంఘం జిల్లా నాయ‌కులు తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. న‌ర్స‌య్య కుటుంబాన్ని ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement