Thursday, May 2, 2024

Union Minister: తెలంగాణలో అభివృద్ధి శూన్యం… కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్

తెలంగాణ ప్రజలు రెండుసార్లు అధికారం ఇచ్చినా.. రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరోపించారు. సోమవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం రెండు పర్యాయాలు కేసీఆర్ కు ప్రజలు అవకాశం ఇచ్చినా అభివృద్ధి మాత్రం చేయలేకపోయారన్నారు.

కాంగ్రెస్ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందని, వారి వైఫల్యం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. బీజేపీ ఏర్పాటుచేసిన మూడు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయన్నారు. తెలంగాణలో కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడిందని, ప్రజలు నష్టపోయారన్నారు. కేసీఆర్ అధికారం లేకపోతే ఉండలేరని, అందుకే అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. బహిరంగ సభలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement