Monday, April 29, 2024

ఉచిత ఎరువులు ఇస్తామన్న మాట ఉత్తదైపోయింది

సీఎం కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ‘‘ఉచిత ఎరువులు ఇస్తామన్న మీ మాట ఉత్తదైపోయింది. చివరి గింజ వరకు కొంటానన్నది ఊసే లేకుండా పోయింది. పెట్టుబడి రాక రైతులు చస్తా ఉంటే మీరు సంబరాలు చేసుకొంటున్నారు. ఇప్పుడు ఎరువుల ధరలు పెరిగాయి అని రైతుల మీద ప్రేమ పొంగుకొచ్చినందుకు చాలా సంతోషం దొరగారు. కానీ కేంద్రం మెడలు వంచుతామంటేనమ్మాలా?.. మొన్నటి వరకు మీ మెడ మీద కత్తి పెట్టి వడ్లు కొనబోమని రాయించుకొన్నారు అన్న వాళ్ళ మెడలు ఈ రోజు మీరు వంచుతారా?.. ఎందుకు మీ రాజకీయ డ్రామాలు?.. మీ అధికారం కోసం, మీ కుర్చీ కోసం మీరు ఆడుతున్న నాటకాలలో ఇదే ఒక భాగమే… మీకు రైతుల మీద ప్రేమ లేదు. రైతుల చావుల మీద సోయి లేదు’’ అని షర్మిల ఫైర్ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement