Saturday, May 4, 2024

Yashoda Hospital – కెసిఆర్ ను ప‌రామ‌ర్శించిన ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క

హైదరాబాద్‌: సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బిఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను డిప్యూటీ ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తుంటి ఆప‌రేష‌న్ విజ‌య వంత‌మైంద‌ని, వేగవంతంగా కెసిఆర్ కోలుకుంటున్నార‌ని వైద్యులు భట్టికి తెలిపారు.. సాధ్య‌మైనంత త్వ‌ర‌లో డిశ్చార్జి చేస్తామ‌ని చెప్పారు. అనంత‌రం కెసిఆర్ తో ఆయ‌న కొంత‌సేపు మాట్లాడారు… అలాగే అక్క‌డే ఉన్న కుమారుడు కెటిఆర్, కుమార్తె క‌వితల‌ను క‌ల‌సి ప్ర‌మాదం జ‌రిగిన తీరును, చికిత్స అందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement