Sunday, May 5, 2024

యాదాద్రిలో భ‌క్తుల సంద‌డి

యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనానికి బారులు తీరిన భక్తులతో బాలాలయ సముదాయాలు, మొక్కు పూజలతో మండపాలు కిక్కిరిసిపోయాయి. కార్తీక మాసం తో పాటు వారాంతపు సెలవుదినం కావడంతో ఆదివారం యాదాద్రీశుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో యాదాద్రి పోటెత్తింది.

శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణతంతు జరిపారు. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం చేశారు. పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో నిత్యపూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement