Monday, April 29, 2024

TS : యాదాద్రి దేవాలయ నిర్మాణం అద్భుతం….గవర్నర్

యాదాద్రి దేవాల‌యాన్ని అద్భుతంగా నిర్మించార‌ని తెలంగాణ గ‌ర్న‌ర్ రాధ‌కృష్ణ‌న్ కితాబిచ్చారు. తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా ఆయ‌న బుధ‌వారం బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న యాదాద్రి ల‌క్ష్మిన‌ర‌సింహ్మ‌స్వామిని ద‌ర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ కు స్వస్తి స్వాగతం పలికారు ఆలయ అర్చకులు, అధికారులు.

- Advertisement -

స్వామివారిని దర్శించుకుని.. స్వర్ణపుష్పార్చనలో పాల్గొన్న గవర్నర్….ప్రత్యేక పూజలు అనంతరం వేద ఆశీర్వచనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది….ఆలయాన్ని అద్భుతంగా పూర్ణ నిర్మాణం చేశారన్నారు. వేల సంవత్సరాలు ఆలయం చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు. చాలాకాలంగా స్వామివారి దర్శనం చేసుకోవాలని అనుకున్న… గవర్నర్ హోదాలో దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉంది….తెలంగాణ ప్రజలు ఆనందంగా సుభిక్షంగా ఉండాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement