Saturday, May 18, 2024

యాదాద్రిలో.. శ్రీ నరసింహస్వామి జయంత్యుత్సవాలు


ఎల్లుండి అంటే మంగ‌ళ‌వారం నుండి యాదాద్రిలో శ్రీ నరసింహస్వామి జయంత్యుత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మే నాలుగో తేదీ వరకు రోజు వారీ జరిగే నిత్య కల్యాణం, శ్రీ సుదర్శన హోమం, బ్రహ్మోత్సవాలను నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. మే 5వ తేదీ నుంచి తిరిగి ఇవన్నీ ప్రారంభమవుతాయని, భక్తులు గమనించి సహకరించాలని ఆలయ అధికారులు కోరారు. ఆలయానికి అనుబంధంగా ఉన్న పాతగుట్ట ఆలయంలోనూ రెండో తేదీ నుంచి 4 వరకు నిత్యకల్యాణం నిలిపివేస్తున్నట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement