Sunday, May 19, 2024

సహజీవనం చేసిన వాడి చేతిలో హత్యకు గురైన మహిళ

సూర్యాపేట, ప్రభ న్యూస్: సహజీవనం చేసిన మహిళను వ్యక్తి హత్య చేసిన సంఘటన పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు ప్రకారం సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రికి చెందిన ఇరుగు మల్సూర్ నీలమ్మ దంపతుల కూతురు ఉప్పలమ్మను 12 ఏళ్ల క్రితం కోమటికుంట గ్రామానికి చెందిన గట్టు ఉప్పలయ్య ఇచ్చి వివాహం చేశారు. కొడుకు పుట్టిన తర్వాత అనారోగ్యంతో ఉప్పలయ్య మృతి చెందాడు. ఆ తర్వాత చివ్వెంల మండలం గాయం వారి గూడెం ఆవాసం టీకం తండాకు చెందిన ధరవత్ రవితో ఉప్పలమ్మ సహజీవనం చేస్తూ కూతురుకు జన్మనిచ్చింది.

ఈ క్రమంలో ఆమె పేరును ధరావత్ ఉమాగా మార్చుకొని జీవిస్తున్నారు. రాడ్ బెండింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్న తర్వాత రవి ఇటీవల ఒక‌ వివాదంలో జైలుకు పోయి వచ్చారు. నిన్న ఉదయం నుండి ఉప్పలమ్మ అలియాస్ ఉమతో గొడవ జరగగా రాత్రి విచక్షణారహితంగా కొట్టడంతో ఉప్పలమ్మ మృతి చెందింది. కోమటికుంట శివారులోని నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద మృతదేహాన్ని వదిలి రవి పరార‌య్యాడు. అంతకుముందే వివాహం కాగా భార్య, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement