Friday, May 17, 2024

భర్తను గొడ్డలితో నరికి చంపిన‌ భార్య

ఇటిక్యాల ఏప్రిల్ 30 ప్రభ న్యూస్ – జోగులమ్మ గద్వాల జిల్లా ఇటిక్యాల మండల పరిధిలోని మొగల్ చెరువులో శనివారం మధ్య రాత్రి భార్య భర్తను దారుణంగా గొడ్డలితో నరికి చంపిన సంఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి మంద దేవరాజు వయసు 35 సంవత్సరాలు భార్య అలివేలమ్మ గత రాత్రి ఇద్దరు మద్యం సేవించి మాట మాట పెంచుకున్నారు, భర్త నిద్రిస్తున్న సమయంలో భార్య గొడ్డలితో నరికి చంపింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ,పిల్లలు ఆదివారం తెల్లవారుజామున లేచి ఇంట్లో నుండి బయటకు వచ్చి గ్రామంలోని వారికి తెలుపగా గ్రామస్తులు చూసి 108 అంబులెన్స్ కి ఫోన్ చేశారు, అంబులెన్స్ సిబ్బంది గ్రామానికి చేరుకొని గాయాలతో ఉన్న దేవరాజును చూసి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారని స్థానికుల సమాచారం, ఇటిక్యాల పోలీసులుకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ గోకారి పోలీస్ సిబ్బంది గ్రామానికి చేరుకొని భార్యను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement