Wednesday, May 8, 2024

ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి వెబ్ కౌన్సిలింగ్

నేటి నుంచి తెలంగాణలో ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి మొదటివిడత వెబ్‌కౌన్సిలింగ్‌ జరగనుంది. ఈ మేరకు కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. మెరిట్ జాబితా, సీట్ల వివరాలను కాళోజి వర్శిటీలో వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. విశ్వవిద్యాలయ పరిధిలోని ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇవాళ్టి నుంచి రేపు సాయంత్రం 6 గంటల వరకు మెరిట్ జాబితాలో అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement