Monday, April 29, 2024

TS: రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్లు గెలుస్తాం: కిషన్ రెడ్డి

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తామని, రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి కుట్రలు చేసినా.. మెజారిటీ ఎంపీ స్థానాలు గెలిచేది ముమ్మాటికి బీజేపీయేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హమీలను నెరవేర్చకుండా ఆలస్యం చేస్తుంద‌ని ఆరోపించారు. ఇచ్చిన ఆరు ప్రధాన హామీల్లో రెండు మాత్రమే అమలు చేశారని, మిగతావి ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కుఠిల రాజకీయం చేస్తుంద‌ని ఆరోపించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 17ఎంపీ స్థానాల్లో తమ పార్టీ పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈసారి హైదరాబాద్ పార్లమెంటు స్థానంపై ఫోకస్ పెట్టామని, అక్కడ కూడా గెలిచేందుకు శాయశక్తులా పని చేస్తామని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement