Sunday, May 5, 2024

స‌మ‌స్య‌ల‌ను ప్రాధాన్య‌త క్ర‌మంలో తీర్చుతాం : ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్

కుత్బుల్లాపూర్:నియోజకవర్గం లో ప్రజా సమస్యలను ప్రాధాన్య‌త క్ర‌మంలో ప‌రిష్క‌రిస్తామ‌ని ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్ స్ప‌ష్టం చేశారు. ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు స్థానిక డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ , కార్పొరేటర్ కొలన్ వీరేందర్ రెడ్డి మరియు కాలనీ వాసులతో కలిసిబుధ‌వారం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి 18వ డివిజన్ శ్రీ హోమ్స్ కాలనీ, నర్సింహా లే-అవుట్, ఎస్.జే.బి హిల్స్ వద్ద స్థానిక సమస్యలపై చ‌ర్చించారు. కాల‌నీ వాసులు డ్రైనేజీ ఔట్ లెట్ సమస్య మరియు నూతనంగా సీసి రోడ్ల ఏర్పాటు తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని సమస్యలను ప్రాధాన్యత క్రమంలో తీర్చుతానని కాలనీ వాసులు హామీ నిచ్చారు.. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆగం పాండు, కాసాని సుధాకర్, బాలాజీ నాయక్, సురేష్ రెడ్డి, సుజాత మరియు సీనియర్ నాయకులు కొలన్ గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగరాజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement