Monday, April 29, 2024

TS: అర్హులైన అందరికీ ఇల్లు మంజూరు చేస్తాం.. సభాపతి పోచారం

అర్హులైన అందరికీ ఇల్లు మంజూరు చేస్తామని తెలంగాణ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని మండల కేంద్రంలో గృహలక్ష్మి పథకంలో మంజురైన వారికి సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే మొదటి స్థానం సంపాదించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.

బాన్సువాడ నియోజకవర్గంలోని అర్హులైన ప్రతివారికీ గృహలక్ష్మిలో ఇళ్లను మంజూరు చేస్తామని లబ్ధిదారులకు సభాపతి హామీ ఇచ్చారు. ఇప్పటికే నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ పథకంలో 11,500 ఇళ్లను మంజూరు చేయడం జరిగిందని, ఇప్పటికే 8000 నిర్మాణాలు పూర్తయ్యాయని స్పష్టం చేశారు. ఎన్నికలు రావడంతో అన్ని పార్టీల నాయకులు తాము ఏదో చేస్తామని ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి మోసం చేసే వాగ్దానాలకు ప్రజలు మోసపోవద్దని పిలుపునిచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement