Sunday, April 28, 2024

TS: ప్రజాదర్భార్ ను జిల్లాలకు విస్తరిస్తాం.. పొన్నం ప్రభాకర్

ప్రజాదర్భార్ ను జిల్లాలకు కూడా విస్తరిస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీని అమలు చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో రెండు అమలు చేశామన్నారు.

ప్రతిరోజు 45లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారన్నారు. ప్రజల సమస్యలు వినేందుకు ప్రజాదర్భార్ చేపట్టామన్నారు. ప్రజాదర్భార్ లో ఎమ్మెల్యేలు పాల్గొనాలన్నారు. త్వరలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement