Monday, April 29, 2024

మల్లన్న స్వామి ఆలయాన్ని అభివృద్ధి పరుస్తాం : మంత్రి కొప్పుల

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మల్లన్నస్వామి ఆలయ అబివృద్దికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం రూ.50 లక్షలతో నిర్మించిన రాజగోపురాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… ఆలయంలో భక్తుల సౌకర్యార్థం అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వామివారు సుఖసంతోషాలను ప్రసాదించాలని, సమృద్ధిగా పంటలు పండాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement