Monday, April 29, 2024

Asaduddin Owaisi: రాజస్థాన్‌లోనూ మూడు స్థానాల్లో పోటీ చేస్తాం

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఈరోజు విడుదలైంది. ఈ సంద‌ర్భంగా మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తమకు ఎమ్మెల్యేలున్నారని, ఎన్నిచోట్ల పోటీ చేస్తామనే అంశంపై త్వరలో చెబుతామని అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో అసదుద్దీన్ మాట్లాడుతూ… ఈసీ ఎన్నికల తేదీలను ప్రకటించిందని, తాము అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాజస్థాన్‌లో మాత్రం మూడు స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. మహిళా బిల్లులో కులగణన చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement