Saturday, April 27, 2024

TS : ఆదిలాబాద్ లో సీఎం కు ఘన స్వాగతం..

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో ( ప్రభ న్యూస్): ప్రధాని నరేంద్ర మోడీ కి స్వాగతం పలికేందుకు సోమవారం ఆదిలాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డికి అధికారులు ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ఉదయం ముఖ్యమంత్రి చేరుకోగానే జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వేడమ బోజ్జూ, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ గౌస్ అలం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.

ప్రధాని మోడీ తెలంగాణ తొలి పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి. అభివృద్ధి పనుల ఏర్పాట్ల గురించి, మోడీ పాల్గొనే బహిరంగ సభ ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. ఏరోడ్రంలో ప్రత్యేకంగా 8 హెలిపాడ్లు ఏర్పాటు చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

- Advertisement -

కిషన్ రెడ్డికి స్వాగతం..
ఉదయం ప్రత్యేక హెలికాప్టర్‌లో కేంద్రమంత్రి జి .కిషన్ రెడ్డి అదిలాబాద్ చేరుకోగా జిల్లా అదనపు కలెక్టర్ కుష్బూ, వివిధ శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. కేంద్ర పోలీసు బలగాల మోహరింపుతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ షెడ్యూల్లో స్వల్ప మార్పు జరిగింది. అనుకున్న షెడ్యూల్ కంటే గంటసేపు ఆలస్యంగా ఆదిలాబాద్ చేరుకుంటున్నారు.

గవర్నర్ తమిళసైకు మంత్రి సీతక్క స్వాగతం..
రాష్ట్ర గవర్నర్ తమిళ సై ఆదిలాబాద్ చేరుకోగా ఇన్చార్జి మంత్రి సీతక్క జిల్లా ఎస్పీ గౌస్ అలం అదనపు కలెక్టర్లు శ్యామల, కుష్బూ తదితరులు స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement