Wednesday, May 1, 2024

Death Toll 6: లారీ డ్రైవర్ అజాగ్రత్తతోనే వర్ధన్నపేట రోడ్డు ప్రమాదం.. సీపీ రంగనాథ్

వరంగల్: వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామంలో ఈరోజు ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంపై వరంగల్ సీపీ రంగనాథ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. స్థానిక పోలీస్ అధికారుల చేత దర్యాప్తు వివరాలు సేకరించారు. ప్రమాదానికి గురైన 7మందిలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. మరొకరు ప్రాణాలతో పోరాడుతున్నారు.

సీపీ రంగనాథ్ తెలిపిన వివరాల ప్రకారం తొర్రూరు వైపు నుండి వరంగల్ వైపు వస్తున్న లారీ అజాగ్రత్తగా నడపడం కారణంగానే ప్రమాదం చోటుచేసుకుందన్నారు. డ్రైవర్ అజాగ్రత్త వల్లే తేనెపట్టు అమ్ముకుని జీవనం పోషించుకునే వారు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement