Friday, April 26, 2024

జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ కు అస్వస్థత

ప్రభ న్యూస్, ప్రతినిధి ములుగు : ములుగు జిల్లా జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ అస్వస్థతకు గురయ్యారు. శనివారం హన్మకొండ స్నేహనగర్ లోని తన నివాసంలో ఉదయం ఛాతిలో నొప్పితో ఒక్కసారిగా ఇంట్లోనే కుప్పకూలిపోయాడు. దీంతో పక్కనే ఉన్న ఆయన భార్య రమాదేవి సీపీఆర్ చేసి చికిత్స నిమిత్తం అజర ఆసుపత్రికి తరలించారు. జగదీశ్ ను పరీక్షించి మైల్డ్ స్ట్రోక్ అని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయనకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితుల పట్లా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement