Sunday, May 5, 2024

వడదెబ్బతో మహిళ మృతి

నల్లబెల్లి : వడదెబ్బతో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని అర్షనపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అర్ష‌నపల్లి గ్రామానికి చెందిన వార్డు మెంబర్ ధార ప్రేమలత గురువారం తన సొంత వ్యవసాయ పొలం పనులు నిమిత్తం బావి దగ్గరకు వెళ్లగా, తీవ్రమైన ఎండ తాపం కారణంగా అస్వస్థతకు గురై, వడ దెబ్బతో గత రాత్రి మృతిచెందారు. నేడు వారి స్వగ్రామం అర్షనపల్లికి వెళ్లి, వారి భౌతికకాయాన్ని సందర్శించి, ప్రేమలత మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ.నివాళులర్పించి, వారి కుటుంబానికి జెడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న ఐదు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. నాయకులు ఉడుగుల ప్రవీణ్, ఎంపీటీసీ బోళ్ల శ్రీలత రమేష్, సర్పంచ్ తిప్పని సృజన లింగ మూర్తి, గ్రామ పార్టీ అధ్యక్ష్యులు బోయిని రాము, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement