టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కి అమెరికా వేదికగా జరగనున్న అంతర్జాతీయ సదస్సుకు హాజరుకావాలంటూ ఆ సదస్సు నిర్వాహకులు ఆహ్వానం పంపారు. మే నెల 1 నుంచి4 వరకు జరగనున్న ఈ సదస్సుకు అమెరికాలోని లాస్ ఏంజెలిస్ వేదిక కానుంది. అమెరికాకు చెందిన మిల్కెన్ ఇన్స్టిట్యూట్ ఈ సదస్సును నిర్వహిస్తోంది. సెలబ్రేటింగ్ ద పవర్ ఆప్ కనెక్షన్ పేరిట మిల్కెన్ ఇన్ స్టిట్యూట్ ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు హాజరుకావాలని, కీలక ప్రసంగం ఇవ్వాలంటూ ఇన్స్టిట్యూట్ అధికారులు కేటీఆర్కు ఆహ్వానం పంపారు. ఇటీవలే వారం రోజుల పాటు అమెరికా పర్యటనకు వెళ్లి వచ్చిన కేటీఆర్.. ఈ సదస్సు నిర్వాహకుల ఆహ్వానంపై ఎలా స్పందిస్తారన్నది వేచిచూడాలి.
Advertisement
తాజా వార్తలు
Advertisement