Monday, May 6, 2024

రేపటి నుండి పీజీ మెడికల్‌ యాజమాన్య కోటాసీట్ల భర్తీకి వెబ్‌ కౌన్సెలింగ్‌

వరంగల్‌, ప్రభన్యూస్‌: రాష్ట్రంలోని ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 7వ తేది వరకు రెండవ విడత వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ విడుదలచేసింది. యూనివర్సిటీ పరిధిలోని యాజమాన్య కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వాాం భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 5 నుంచి 7వతేది మధ్యాహ్నం 2 గంటల వరకు వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు.

గత విడత కౌన్సెలింగ్‌లో సీటు అలాట్‌ అయి జాయిన్‌ కానీ అభ్యర్థులు, అదేవిధంగా కళాశాలలో చేరి డిస్కింటిన్యూ చేసిన అభ్యర్థులు ఈ విడత వెబ్‌ కౌన్సిలింగ్‌కు అనర్హులని వర్సిటీ ప్రకటించింది. అలాగే ఆల్‌ ఇండియా కోటా కౌన్సిలింగ్‌ కింద ఇప్పటికే అభ్యర్థులను ఈ వెబ్‌ కౌన్సిలింగ్‌కు అనర్హులుగా పరిగణిస్తామని పేర్కొంది. మరిన్ని వివరాలకు డబ్ల్యూడబ్ల్యూజే.కెఎన్‌ఆర్‌యుహెచ్‌ఎస్‌.తెలంగాణ.జీఓవి.ఇన్‌ వెబ్‌సైట్‌ను చూడాలని యూనివర్సిటీ వర్గాలు సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement