Wednesday, May 1, 2024

అర్హులంద‌రికీ పింఛ‌న్లు అందిస్తాం : ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి

చెన్నరావుపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల మంజూరు చేసిన రూ.10 లక్షల నూతన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నేడు చెన్నరావుపేట మండలంలోని ఉప్పరపల్లి, జీడిగడ్డ తండా గ్రామాలకు సంబంధించిన 186 మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార్డులను నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నేరుగా లబ్ధిదారుల గ్రామాలకే వెళ్లి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి వారికి కార్డులను అందచేయడం జ‌రిగింద‌న్నారు. నూతన పెన్షన్ కార్డులను మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కి, తమ గ్రామాలకు స్వయంగా వచ్చి కార్డులను అందచేసిన ఎమ్మెల్యే పెద్దికి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పెన్షన్ కార్డులను అందుకున్న లబ్ధిదారులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జ‌డ్పీటీసీ, వైస్ ఎంపీపీ, మండల పార్టీ అధ్యక్షులు, సంబంధిత అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, పీఏసీఎస్ చైర్మన్, ఆర్ ఎస్ ఎస్ కన్వీనర్లు, క్లస్టర్ భాద్యులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement