Friday, May 17, 2024

పబ్లిసిటీ కోసం పైసల వసూలు.. స‌ర్పంచ్‌పై యాక్ష‌న్ తీసుకోవాలంటున్న గ్రామ‌స్తులు

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేట సర్పంచ్ ప‌బ్లిసిటీ కోసం పైస‌లు వ‌సూలు చేస్తున్నాడు. మల్లక్క పేరుతో ఓ గులాబి రంగు కార్డును ముద్రించి దానికి 100రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమ‌లుచేస్తున్న ఆసరా పింఛ‌న్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇట్లా తన స్వలాభం కోసం వాడుకుని, పథకాన్ని అభాసుపాలు చేస్తున్నట్లు చాలామంది చెబుతున్నారు. ఈ విషయ‌మ్మీద‌ విచారణ జరిపి, త‌గిన‌ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారుల‌ను కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement