Monday, April 29, 2024

Gandra: తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్

(ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి) : తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్ అని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి ప‌ట్ట‌ణంలో ఆచార్య జయశంకర్ వర్ధంతి సందర్భంగా బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గల జయశంకర్ విగ్రహానికి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. జయశంకర్ తెలంగాణే ఊపిరిగా శ్వాస ఉన్నంత వరకు తెలంగాణ కోసం ఉద్యమించారని ఆయ‌న సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు. తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో కేసీఆర్‌కు వెన్నంటి ఉండి రాష్ట్ర సాధనలో భాగస్వాములయ్యారని కొనియాడారు. నీళ్లు, నిధులు నియామకాలు జయశంకర్ కల అని, సీఎం కేసీఆర్ ఆ కలను నిజం చేసి చూపించారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement