Saturday, May 4, 2024

జనగామలో ఎమ్మెల్యే గా పోటీ చేస్తానన్న ప్రచారం అవాస్తవం : ఎమ్మెల్సీ పోచంపల్లి

జనగామ ఎమ్మెల్యే టికెట్ రేసులో తాను ఉన్నట్లు వస్తున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ పోచంపల్లి మీడియా సమావేశంలో మాట్లాడారు. జనగామలో తాను పోటీ చేస్తానన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి జనగామను చాలా వేగంగా అభివృద్ధి చేస్తున్నాడు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పన్నెండు నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపుకోసం పాటుపడుతానని ఆయన స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాల మేరకు జనగామలో ఇన్‌చార్జిగా పనిచేశా. అంతేతప్పా ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement