Friday, May 3, 2024

TS | విద్యుత్​ లైన్​ రిపేర్​ చేస్తున్న వ్యక్తికి షాక్.. తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు!

నెక్కొండ, (ప్రభ న్యూస్): వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో ఘోరం జరిగింది. మండలంలోని మూడుతండా గ్రామానికి చెందిన భూక్య వీరన్న ఎలక్ట్రికల్​ వర్క్​ చేస్తుండగా విద్యుత్ షాక్ కొట్టింది. చెన్నారావుపేట మండలం లింగగిరి శివారులో 11కేవీ విద్యుత్ లైన్ మరమ్మతు పనులలో రోజువారీ కూలీగా వెళ్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం విద్యుత్ స్తంభం ఎక్కి రిపేర్లు చేస్తుండగా విద్యుత్ షాక్​కు గురయ్యాడు.

దీంతో స్తంభం పైనుంచి కిందపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తీవ్ర గాయాలు కావడంతో హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యుత్ లైన్మెన్ నిర్లక్ష్యం కారణంగానే వీరన్నకు విద్యుత్ షాక్ కొట్టిందని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement