Friday, May 3, 2024

Hanamkonda : కొడుకును గొడ్డలిలో నరికి చంపిన తండ్రి

కన్నకొడుకును తండ్రి గొడ్డలితో నరికిచంపిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లిలో మండలంలో జరిగింది. భీమదేవరపల్లికి చెందిన మాచర్ల కుమారస్వామి, శ్రీకాంత్‌ తండ్రీ కొడుకులు. కుటుంబకలహాలతో తండ్రి కుమారస్వామిపై.. శ్రీకాంత్ గొడ్డలితో దాడి చేశాడు. అయితే అదే గొడ్డలి అందుకున్న కుమారస్వామి కొడుకుపై ప్రతి దాడిచేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement