Friday, April 26, 2024

హనుమకొండలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

తెలుగు దేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఎండీ రహీం ఆధ్వర్యంలో హనుమకొండ పోలీస్ హెడ్ క్వార్టర్ ఎదురుగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర స్థాయి వరంగల్ పార్లమెంట్ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్య, ఎండీ రహీమ్ సంయుక్తంగా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం ఉందని, పేద బడుగు బలహీన దళిత వర్గాల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ కృషి చేసిన తీరు, ఇచ్చిన హామీలను మరచి బీఆర్ఎస్, బీజేపీలు తెలంగాణ ప్రజలను మోసం చేసిన తీరును కేంద్ర రాష్ట్ర వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ ప్రజలలో తెలుగుదేశం పట్ల మరింత ఆదరణ పెరిగేలా ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీ రహీమ్ తో పాటు నాయకులు ఆర్షనపల్లి విద్యాసాగర్ రావు, హనుమకొండ సాంబయ్య, ఈశ్వర చారి, అనిశెట్టి సతీష్, కొంగర ప్రభాకర్, జయశంకర్, బింగి మల్లేశం, చీకటి రాజు, బర్ల యాకుబ్, మనోహర్, మహేందర్, ఉపేందర్, సురేందర్, పిట్టల శ్రీనివాస్, చేన్నోజు రఘుబాబు, మొగిలి, కృష్ణ, రాములు తదితరులు ఉన్నారు. అనంతరం హైదరాబాదులో జరిగే తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల సభకు తరలి వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement