Monday, May 6, 2024

ఈటెలను పరామర్శించిన పొన్నం ప్ర‌భాక‌ర్‌

హుజురాబాద్ శాసనసభ్యులు, రాష్ట్ర బీజేపీ నాయకులు ఈటల రాజేందర్ తండ్రి ఈటెల మల్లయ్య ఈరోజు మృతి చెందడం పట్ల కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈటెల రాజేందర్ నివాసానికి వెళ్లిన పొన్నం ప్ర‌భాక‌ర్ ఈటెల‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబంలో తండ్రి లేని లోటు ఎవరూ తీర్చలేనిదని, ఈటెల మల్లయ్య మరణం పట్ల ఈటల కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కలిగించాలని కోరుకుంటున్నాన‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement