Wednesday, April 24, 2024

క‌రెంట్ షాక్ తో వ్య‌క్తి మృతి

క‌రెంట్ షాక్ కొట్ట‌డంతో ఓ వ్య‌క్తి మ‌ర‌ణించాడు.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలోని నంబర్ వన్ కాలనీకి చెందిన పైసా సదానందం అనే వ్యక్తి దుస్తుల‌ని ఆరవేసే ఇనుప వైరుకి కరెంటు రావడంతో కింద‌ప‌డిపోయాడు.. దాంతో ఇంటి పక్కన ఉన్న వ్యక్తులు హుటాహుటిన నర్సంపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఈసీజీ తీసి చనిపోయాడని నిర్ధారించారు. కాగా చనిపోయిన వ్యక్తిని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement