Wednesday, May 1, 2024

WGL: బీఆర్ఎస్ మేనిఫెస్టోపై ప్రజలకు విశ్వాసం ఉంది.. ఎమ్మెల్యే గండ్ర

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమాన్ని కార్యకర్తలు, విస్తృతంగా ప్రచారం చేయాలని బీఆర్ఎస్ 2023 మేనిఫెస్టో పట్ల ప్రజలకి విశ్వాసం ఉందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి అన్నారు. జయశంకర్ జిల్లా మొగుళ్లపల్లి మండలం గుడిపహాడ్, గుండ్లకార్తి, వేములపల్లి, నర్సింగపూర్, మెట్టుపల్లి, బంగ్లపల్లి, మొట్లపల్లి గ్రామాలలో పార్టీ శ్రేణులతో బుధవారం సమావేశం నిర్వహించారు.

ఈసందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ… అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరవేయాలని, బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజల అభివృద్ధి కోసం అనేకమైన మంచి పథకాలు మేనిఫెస్టోలో ప్రవేశపెట్టడం జరిగిందని, వాటిని నాయకులు, కార్యకర్తలు ప్రజలకు చేరవేసే విధంగా పాటుపడాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement