Thursday, April 25, 2024

పేరుకే పట్టణ ప్రగతి-రూపాయి అభివృద్ధి లేదు -ప‌ద్మ‌

హనుమకొండ, హంటర్ రోడ్ లోని  వేద ఫంక్షన్ హాల్ లో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు దేశినీ సదానందం గౌడ్, కొండి జితేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కందగట్ల సత్యనారాయణ, కార్యదర్శి గుజ్జుల మహేందర్ రెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకర్గ కన్వినర్ పాశికంటి రాజేంద్ర ప్రసాద్, కార్పొరేటర్ గుజ్జుల వసంత తదితరులు పాల్గొన్నారు. బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఇలా కామెంట్స్ చేశారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన కెసిఆర్ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరుతో టిఆర్ఎస్ పార్టీ పబ్బం గడుపుతుంది. అభివృద్ధి అనేది ప్రకటనలకే పరిమితం. గ్రౌండ్ రిపోర్ట్ అస్తవ్యస్తంగా ఉన్న అధికారుల ద్వార గుడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రవేశపెడుతున్నారు ఈ కెసిఆర్ ప్రభుత్వం. పేరుకే పట్టణ ప్రగతి.. రూపాయి అభివృద్ధి లేదు. ప్రతిపక్ష కార్పొరేటర్ లు, కౌన్సిలర్లు, సర్పంచ్ లు ఉన్నచోట వివక్ష చూపిస్తూ నిధులు ఇవ్వకుండా ఆవేదనకు గురిచేస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement