Friday, May 3, 2024

పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే నన్నపునేని

తెలుగు సంవత్సరాది “ఉగాది” శ్రీ శుభకృత్ నామ సంవత్సరం సందర్భంగా 37 వ డివిజన్ ఖిలా వరంగల్ తూర్పు కోటలోని చారిత్రాత్మక శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పెద్దమ్మ తల్లి గుడిని తాను మేయర్ గా ఉన్నప్పుడు అభివృద్ధి చేశామన్నారు. రాబోయే ఉగాదికి మరింతగా అభివృద్ధి చేసుకుందామని,ఖిలావరంగల్ ప్రాంతాన్ని ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తానని తెలిపారు. ప్రపంచం మన ఖిలాను చూసే విధంగా అభివృద్ధి ఉంటుందని తెలిపారు. పెద్దమ్మ తల్లి ఆశీస్సులుతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement