Friday, May 3, 2024

మిషన్ భగీరథ పైపుల దొంగ‌ల‌ను పట్టుకున్న పోలీసులు

పాలకుర్తి : జనగామ జిల్లా పాలకుర్తి మండల పరిధిలోని శివార్లలో మిషన్ భగీరథ పైపులైను ఎత్తుకెళ్తున్నారన్న సమాచారంతో పాలకుర్తి ఎస్సై కొలిచలం వంశీకృష్ణ ఆధ్వర్యంలో నిందితులను పోలీసులు ప‌ట్టుకున్నారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన రాపోలు సాయికుమార్, రాపోలు కృష్ణ, కొడకండ్ల మండలం రేగుల గ్రామానికి చెందిన రాపోలు అంజయ్యలు ఈనెల 6న పెళ్లిళ్లకు వచ్చి 10 రోజులుగా తిరుగుతూ పాలకుర్తి మండల శివార్లలో ఉన్నటువంటి మిషన్ భగీరథ పైపులను సుమారు 80 పైపులను ఎత్తుకెళ్లారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని పట్టుకొని పైపులను స్వాధీనం చేసుకున్నారు. పాలకుర్తి సీఐ పోలీసులను అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో హెడ్ కానిస్టేబుల్ వెంకన్న, కానిస్టేబుల్ శ్రీనివాస్, కర్ణాకర్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement