Thursday, April 25, 2024

మెడిక‌ల్ కాలేజ్.. హాస్ప‌ట‌ల్ ని ప్రారంభించిన మంత్రులు

వరంగల్ హంటర్ రోడ్డులో కొలంబో మెడికల్ కాలేజి, హాస్పిటల్ లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ లతో కలిసి ప్రారంభించారు రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు.కాగా హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం కుల, మతాల తేడా లేకుండా అందరికీ సమ అవకాశాలు ఇస్తున్నారు.60 ఏళ్లలో 3 ప్రభుత్వ కాలేజీలు ఉంటే, 9 ఏళ్లలో 21 కి చేరింది.నాడు ప్రభుత్వ , ప్రైవేటులో మొత్తం 20 మెడికల్ కాలేజీలు ఉంటే నేడు 55 కు చేరాయి.ఎంబిబిఎస్ సీట్లు నాడు 2950, నేడు 8340 సీట్లు. వరంగల్ నగరంలో మూడు మెడికల్ కాలేజీలు ఉండే నగరం అయ్యింది.తెలంగాణ రావడం వల్ల, సీఎం కేసీఆర్ సీఎం కావడం వల్ల ఇది సాధ్యమైంది.మెడికల్ కాలేజీ అంటే 500 పడకల ఆసుపత్రి వస్తది. దీంతో ఇక్కడి వారికి ఉపాధి వస్తుంది. ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది.

భూపాలపల్లి, జనగాంలో మెడికల్ కాలేజీలు వచ్చాయి. ములుగులో మెడికల్ కాలేజీ వస్తుంది.ఉత్తర తెలంగాణకు ఎంతో వైద్య సేవలు అందించేందుకు హెల్త్ సిటీ నిర్మాణం 1100 కోట్లతో జరుగుతున్నది.ఈ ఆసుపత్రి ద్వారా పేదలకు ఉచిత వైద్య సేవలు అందించాలని కోరుతున్నా..ప్రభుత్వం మీకు పూర్తి మద్దతుగా ఉంది, మీరు సీఎం కోసం ప్రార్థన చేయాలి. అండగా ఉండాలి. మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ…పాత మిషన్ ఆసుపత్రి మించి కొలంబో ఆసుపత్రి పని చేయాలని కోరుతున్నా…మీరు ప్రజలకు ఉచితంగా, మంచి వైద్యం ఇస్తారని నమ్మకం తోనే ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వచ్చారు.ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మేల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, అరూరీ రమేశ్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement