Friday, March 29, 2024

గోశాలలకు ఎమ్మెల్యే సండ్ర .. పశుగ్రాసం వితరణ

ఖమ్మంలోని 11 గోశాలలకు సత్తుపల్లి నియోజకవర్గం నుండి 150 ట్రాక్టర్ ట్రక్కుల పశుగ్రాసాన్ని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య వితరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఖమ్మం గోశాలలో నిర్వహించిన గోపూజలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర , ఖమ్మం జిల్లా అదనపు కలెక్టరు మధుసూదన్, సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య దంపతులు పాల్గొన్నారు. మూగ జీవాలకు పశుగ్రాసాన్ని వితరణ చేయడం గొప్ప అనుభూతిని కలిగిస్తుందనీ వెంకట వీరయ్య పేర్కొన్నారు. భారతీయ సంస్కృతిలో గోమాతను దేవతగా భావిస్తారని, గో సేవ ఎంతో గొప్ప కార్యక్రమమని వాటికి సేవ చేసుకునే భాగ్యం పశుగ్రాస వితరణతో కలగడం గొప్ప అనుభూతిని కలిగిస్తుందని అన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. నోరు ఉండి మాట్లాడగలిగే ప్రతి జీవికి ఏదో రకంగా సహాయం అందుతున్న తరుణంలో నోరులేని మూగజీవాలకు సహాయం అందించాలనే సంకల్పంతో.. సత్తుపల్లి నియోజకవర్గ రైతులు సహకారంతో ఐదు ఏళ్ల నుండి గోశాలలకు పశుగ్రాసాన్ని వితరణ చేస్తున్నామని అన్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా 120 కిలోమీటర్ల నుండి ఖమ్మంకు 150 ట్రాక్టర్ల ట్రక్కుల పశుగ్రాసాన్ని ఆనందించేందుకు రైతులు పిలుపు మేరకు స్వచ్చందంగా సహకరించారన్నారు. రైతుల జీవితంతో ముడిపడి ఉన్న గోసంపదని రక్షించాలి, గోవును పూజించాలనే సంకల్పంతో కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గోదావరి వరదల కారణంగా సర్వస్వం కోల్పోయిన వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విధాల సహాయం అందిస్తే, నోరులేని మూగజీవాలకు పశుగ్రాసం కొరత ఏర్పడడంతో, గోవులకు సహాయం అందించాలని ఆ రోజుల్లో పిలుపునిస్తే వందల సంఖ్యలో పశుగ్రాసం దొరకని సమయంలో కూడా రైతులు పెద్ద సంఖ్యలో భద్రాచలం గోశాలలకు పశుగ్రాసాన్ని అందించామన్నారు. కరోనా వంటి కష్టకాలంలో కూడా గోశాలకు పశుగ్రాసాన్ని అందించి చేయూతని ఇచ్చామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement