Wednesday, April 24, 2024

కొత్తగూడ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్.. 30 మందికి అస్వస్థత..

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని స్పోర్ట్స్ స్కూల్ లో ఆదివారం విద్యార్థులు తిన్న ఆహారం వికటించి ఫుడ్ పాయిజన్ అయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం నుండి విద్యార్థులు అస్వస్థతకు గుర‌య్యారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో తమ పిల్ల‌లు తీవ్ర అస్వస్థకు గుర‌య్యార‌ని తల్లిదండ్రులు ఆరోపించారు. సుమారు 30 మంది అస్వస్థకు గురైనా ప‌ట్టించుకోకుండా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు వ్యవహరించడం.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడ‌ట‌మే అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ అవడానికి నిర్లక్ష్యం వ్యవహరించిన హెడ్మాస్టర్, వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement