Wednesday, April 17, 2024

నాటు బాంబుల కలకలం

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నాటు బాంబులు క‌ల‌క‌లం రేపాయి. బస్టాండ్ సమీపంలో బాంబు పేలిన శబ్దాన్ని విని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంట‌నే పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్నారు. చుట్టు ప‌క్క‌ల ప‌రిస‌రాల‌ను ప‌రిశీలించ‌గా ఐదు నాటు బాంబులను పోలీసులు గుర్తించారు. ఇవి ఎక్క‌డి నుంచి వ‌చ్చాయి ఎవ‌రు పెట్టారు అనేది తెలియాల్సి ఉంది. ప్రథామికంగా ఊర పందుల కోసం నాటు బాంబులు పెట్టినట్లు అనుమానిస్తున్నారు. నాటు బాంబులు ఉన్న వైపు ప్రజలు ఎవరు వెళ్లకుండా పోలీసులు తాడును అడ్డుగా కట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement