Wednesday, March 27, 2024

శ్రద్దాని హత్య చేసింది నేనే.. క్షణికావేశంలో తొందరపడ్డా.. ఆఫ్తాబ్

శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్‌ను నేడు కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీలోని సాకేత్ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయస్థానం అతడిని విచారించగా.. శ్రద్ధాను హత్య చేసింది తానే అని అంగీకరించాడు. క్షణికావేశంలోనే శ్రద్దాను హత్య చేసినట్టుగా చెప్పాడు. శ్రద్ధాను నేనే హత్య చేశా. ఆ రోజు జరిగింది ఏదైతే ఉందో.. అదంతా ఘర్షణ వాతావరణంలో క్షణికావేశంలో జరిగింది. కేసు విచారణలో పోలీసులకు సహకరిస్తున్నా. శ్రద్ధా శరీర భాగాలను పడేసిన ప్రదేశానికి సంబంధించిన మ్యాప్‌లను కూడా ఇచ్చా. శ్రద్ధా హత్యకు సంబంధించిన అన్ని వివరాలు పోలీసులకు అందజేస్తా. అయితే, ఘటన జరిగి చాలా కాలం గడిచినందున చాలా విషయాలు గుర్తుకు రాలేదు’ అని ఆఫ్తాబ్‌ కోర్టులో తెలిపాడు. దీంతో ఆఫ్తాబ్‌కు పోలీసు కస్టడీని న్యాయస్థానం మరో నాలుగు రోజులకు పొడిగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement