Saturday, May 4, 2024

జయశంకర్‌ సార్‌ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు : మంత్రి ఎర్రబెల్లి

ప్రొఫెసర్‌గా, తెలంగాణ సిద్ధాంత కర్తగా ప్రజల్లో చెరగని ముద్ర వేసిన మహోన్నతుడు కొత్తపల్లి జయశంకర్ సార్ అని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఏకశిల పార్క్‌లో ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే తెలంగాణకు జరుగుతోన్న అన్యాయాల పట్ల, అసమానతల పట్ల జ‌య‌శంక‌ర్ సార్ తీవ్రంగా పోరాటం చేశారని మంత్రి గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను గల్లీ నుంచి ఢిల్లీ దాకా వ్యాప్తి చేయడంలో వారి పాత్ర మరవలేనిది. తెలంగాణలోని ప్రతీ పల్లె ఆయన మాటతో పోరాట గుత్పలను అందుకుందన్నారు. జయశంకర్ సార్ జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement