Wednesday, May 1, 2024

షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

మల్హర్, మే 21 (ప్రభ న్యూస్) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని నాచారం గ్రామ పంచాయతీ పరిధిలో గల కాలవేణి సమ్మయ్య ఇల్లు ఆదివారం కరెంటు షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్ధమైంది. సమ్మయ్య కుటుంబీకులు పొలం పనికి వెళ్లి వచ్చేసరికి దట్టంగా మంటలు వ్యాపించడంతో గమనించిన గ్రామస్తులు నీళ్లతో చల్లార్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. సమ్మయ్య ఇంట్లో ఉన్న బట్టలు, బియ్యం, వంట పాత్రలు మంచాలు, గృహోపకరణాలు, విలువైన వస్తువులు అగ్నికి ఆహుత‌య్యాయి. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత సమ్మయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement