Thursday, May 2, 2024

Narsampet: గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

నర్సంపేట్ , ఖానాపురం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతిచెందాడు. స్థానిక ఎస్సై పిట్టల తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కుందనపల్లి గ్రామానికి చెందిన మద్దెల సూర్యనారాయణ హెడ్ కానిస్టేబుల్ గా ఖానాపురం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడు.

నర్సంపేట పట్టణంలో నివాసం ఉంటున్న ఆయనకు గుండెపోటు రావడంతో హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. తమతో కలిసి విధులు నిర్వహిస్తున్న సూర్యనారాయణ మృతి చెందడంతో ఖానాపూర్ ఎస్ఐ తిరుపతితో పాటు సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement