Friday, May 3, 2024

హనుమకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది మందుపార్టీ..

హనుమకొండ : హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో మహిళా సిబ్బంది మందుపార్టీ చర్చనీయాంశంగా మారింది. స్టాఫ్‌ రూమ్‌లో బీర్లు తాగుతూ మహిళా సిబ్బంది హల్‌చల్‌ చేశారు. రోగులను గాలికి వదిలేసి బీరు తాగుతూ ఎంజాయ్‌ చేశారు. మందు పార్టీలో ఆరోగ్యశ్రీ ఉద్యోగి, ఒక స్టాప్‌నర్స్‌, మరొక జీఎన్‌ఎం ఉన్నారు. కాగా… సిబ్బంది వెకిలి చేష్టలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్‌ను బార్‌గా మార్చిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement