Sunday, April 28, 2024

TS | తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి..

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోజెర్వు గ్రామానికి చెందిన ధీకొండ నాగేశ్వరరావు(47) మంగళవారం తాటిచెట్టుపై నుంచి పడి మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి నాగేశ్వరరావు రోజువారీ పనుల్లో భాగంగా తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి చెట్టుపై నుంచి కింద పడ్డాడు. గమనించిన చుట్టుపక్కల వారు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందినట్లు తెలిపారు. కాగా మృతుడికి భార్య శోభ, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement