Friday, May 17, 2024

పత్తి చేనులో వృద్ధుడి ఆత్మహత్య..

వెంకటాపూర్ : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని నారాయణగిరి పల్లె గ్రామ పంచాయతీ పరిధిలో ఓ పత్తి చేనులో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధర్మసాగర్ కొత్తపల్లి గ్రామానికి చెందిన సంగెం లచ్చయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తాజుద్దీన్ తెలిపారు. పాలంపేట- ములుగుకు వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఉన్న సిమెంట్ బ్రిక్స్ సమీపంలో సదరు వ్యక్తి అచేతనంగా పడి ఉండడం చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తి మరణించినట్టుగా గుర్తించారు. మృతదేహం పక్కనే క్రిమిసంహారక మందు డబ్బా ఉండడంతో అది తాగి మరణించి ఉంటారని ప్రాథమిక అంచనాకు వచ్చారు. వృద్ధుడు ఇంతదూరం వచ్చి ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలియరాలేదు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement