Friday, May 17, 2024

అప్పుల బాధ తాళలేక ఉరివేసుకుని వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య

గణపురం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని గాంధీనగర్ గ్రామానికి చెందిన లాదెళ్ల రవి (55) అప్పుల బాధతో ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడు రవికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు రాజశేఖర్ ఉన్నారు. సోమవారం మృతుడి కుమారుడు రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement